మహిళా కానిస్టేబుల్ ఔదార్యం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈరోజు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. అన్నమయ్య జిల్లాలో ఓ బాలింత పరీక్ష రాసేందుకు రాగా, ఆ చిన్నారిని మహిళా కానిస్టేబుల్ లాలించిన వైనం చూపరులను కట్టిపడేసింది. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య కాలేజీలో ఆదివారం కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. ఈ క్రమంలో ఓ తల్లి పరీక్ష రాసేందుకు 4 నెలల చిన్నారితో కాలేజీకి చేరింది. ఆమె తన తల్లికి, భర్తకు బిడ్డను బయట అప్పగించి పరీక్ష రాసేటందుకు పరీక్ష కేంద్రానికి వెళ్లింది. పరీక్ష మొదలైన అరగంట నుంచి చిన్నారి ఏడ్వడం మొదలు పెట్టాడు. చిన్నారి తండ్రి ఎంత లాలించిన బాబు ఏడుపు ఆపలేదు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న బాలింత అయిన మన్నూరు పోలీస్ స్టేషన్ ఉమెన్ కానిస్టేబుల్ అమరావతి, పిల్లాడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని పాలిచ్చి లాలించడంతో చిన్నారి నిద్రలోకి జారుకున్నాడు. ఇదంతా గమినిస్తున్న విధులలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది కానిస్టేబుల్ అమరావతి సేవలను కొనియాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)