బండి సంజయ్ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు

Telugu Lo Computer
0


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుండి ఆయనను హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ ఘటనలో బండి సంజయ్ సహా 8 మందిపై పోలీసులు చేశారు. ఏనుగు రవీందర్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి సహా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు మూడు రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా బండి సంజయ్ అక్కడకు వెళ్లి బాధితులకు భరోసానిచ్చి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)