ఎన్ఆర్ఐ ఆస్పత్రిపై ఇడి దాడులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆస్పత్రులపై ఇడి దాడులు చేస్తోంది. మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలలో ఇడి, ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయి ఇడి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. కోవిడ్ సమయంలో భారీగా అవతవకలకు పాల్పడినట్టు ఇడి గుర్తించి కేసు నమోదు చేసింది. కోవిడ్ ట్రీట్‌మెంట్ తీసుకున్న 1500 మంది వివరాలను రికార్డుల్లో చేర్చలేదని అధికారులు గుర్తించారు. మాన్యువల్ రశీదులు, నకిలీ రశీదులతో నిధులు మళ్లించారని అభియోగాలు వచ్చాయి. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నిధులను మళ్లించినట్లు గుర్తించారు. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఇంట్లో ఇడి సోదాలు చేస్తుంది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి పాత మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)