రాజస్థాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్లలో అమిత్ శర్మ ఒకరు. అయితే అతను పాముతో కలిసి వీడియో తీస్తున్న క్రమంలో పాము కాటుకు గురయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాము విషం అతని శరీరంలోకి వెళ్లిందని తెలుస్తోంది. అమిత్ శర్మ 'క్రేజీ xyz' అనే యూట్యూబ్ ఛానెల్ ను నడుపుతున్నాడు. ఈ ఛానల్ కు 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అమిత్ శర్మ అల్వార్లోని బన్సూర్ జిల్లాలో నివసిస్తున్నారు. అతను IIT రూర్కీ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. యూట్యూబ్ ఛానెల్ 'క్రేజీ XYZ'ని 2017లో ప్రారంభించారు. తన యూట్యూబ్ ఛానెల్, 'క్రేజీ XYZ'లో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తాడు. అమిత్ శర్మ తన యూట్యూబ్ ఛానెల్ 'క్రేజీ XYZ నుంచి ప్రతి నెలా 9 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ శర్మకు పాము కాటుకు గురైనట్లు వీక్షకులకు తెలియజేస్తూ అతని స్నేహితులు ఒక వీడియోను ఛానెల్లో పోస్ట్ చేశారు. యూట్యూబర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతున్నాడని అమిత్ శర్మ స్నేహితులు తెలిపారు.