కర్ణాటకలోని ఉడుపి జిల్లా కార్కళ తాలూకా నెల్లికారు గ్రామ పంచాయతీ పరిధిలోని మైనేరు వద్ద ప్రైవేట్ బస్ వేగంగా వచ్చి కారును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ (36), భార్య ప్రత్యూష, మూడేళ్ల కూతురు గమ్య దుర్మరణం పాలయ్యారు. బస్సు ధాటికి కారు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దంపతులు ఇద్దరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. వారాంతపు సెలవులు కావడంతో సొంత కారులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయల్దేరారు. శుక్రవారం రాత్రి ధర్మస్థలకు చేరుకున్నారు. మంజునాథస్వామిని దర్శించికొని అక్కడి నుంచి శృంగేరికి వెళ్తుండగా ఘాటు రోడ్ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు కాగా ముగ్గురూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు. మృతులు అనంతపురం జిల్లావాసులని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోలీసులు మూడబిదిరె ఆస్పత్రిలో ఉంచారు.
విహారయాత్రలో విషాదం !
December 11, 2022
0