చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

Telugu Lo Computer
0


చైనా నుంచి శుక్రవారం మన దేశానికి వచ్చిన 40 ఏళ్ళ వయసుగల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ వేరియంట్ గురించి తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఆయన శాంపిల్‌ను లక్నో పంపించారు. ఆగ్రాలో నవంబరు 25 తర్వాత కోవిడ్ పాజిటివ్ కేసు నమోదవడం ఇదే మొదటిసారాని ఆగ్రా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఏకే శ్రీవాస్తవ ఆదివారం తెలిపారు. చైనాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు శుక్రవారం వచ్చినట్లు తెలిపారు. ఆయనకు రోగ లక్షణాలు కనిపించలేదన్నారు. ఆయనను షాగంజ్ ప్రాంతంలోని తన ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.   వ్యక్తితో కలిసి చైనా నుంచి వచ్చినవారిని సంప్రదించినట్లు ఆగ్రా ఆరోగ్య శాఖాధికారులు చెప్పారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వారిని కోరినట్లు తెలిపారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగ్రా రైల్వే స్టేషన్, బస్టాండ్లలో టెస్టింగ్‌ను పెంచారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆగ్రాలోని హోటళ్లు క్రిక్కిరిసి ఉన్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)