పశువులను ఢీకొన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్

Telugu Lo Computer
0


గాంధీనగర్-ముంబయి వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి గుజరాత్‌లోని ఉద్వాడ- వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొన్నట్లు రైల్వే అధికారి తెలిపారు. పశువులను ఢీకొనడంతో రైలు ముందు ప్యానెల్‌కు చిన్నపాటి డెంట్‌ ఏర్పడిందని రైల్వే అధికారి పేర్కొన్నారు. సెమీ-హై స్పీడ్ రైలు నడపటం ప్రారంభించిన తర్వాత రెండు నెలల్లో ఇది నాల్గవ సంఘటన.ఉద్వాడ- వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో ఈ సంఘటన జరిగిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ చెప్పారు.కొద్దిసేపు ఆగిన తర్వాత రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)