కేరళలోని కొట్టాయం జిల్లాలో రెండు పంచాయితీలు బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఒక కిలోమీటరు పరిధిలో దాదాపు 8 వేల బాతులు, కోళ్లు, ఇతర పెట్ బర్డ్స్ను చంపేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నెల రోజుల క్రితం బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు ఇరవై వేల పక్షులను చంపాలని ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే. అర్పుకర, తాళయాజం పంచాయతీల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కేసుల దృష్ట్యా జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటర్ పరిధిలో కనిపించే పక్షులను పట్టుకుని చంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని అధికారులను కూడా ఆదేశించారు కలెక్టర్. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిలో కోడి, బాతు, ఇతర దేశీయ పక్షులు, గుడ్లు, మాంసం, పేడ విక్రయాలను రవాణాను నిషేధించారు. అర్పుకరలోని డక్ ఫామ్లో తలయాజంలోని బ్రాయిలర్ కోళ్ల ఫారమ్లో పక్షులు మరణించిన తర్వాత.. నమూనాలను భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లాబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన చోట బాధిత పంచాయతీల్లో పక్షులను చంపేందుకు పశుసంవర్థక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసింది.
కేరళలో బర్డ్ ఫ్లూ
December 16, 2022
0
Tags