రామ్‌లీలా మైదానంలో ఇపిఎస్‌ పెన్షనర్ల ధర్నా

Telugu Lo Computer
0


ఢిల్లీ లోని రామ్‌లీలా మైదానంలో ఇపిఎస్‌ పెన్షనర్లు కనీస పెన్షన్‌ రూ.9 వేలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, గోవాసహా పలు రాష్ట్రాల పెన్షనర్లు పాల్గొన్నారు. హైపర్‌ పెన్షన్‌ అందరికీ అమలు చేయాలని, భార్యాభర్తలకు మెడికల్‌ సదుపాయాలు కల్పించాలని నినాదాలు చేశారు. పెన్షనర్ల కోఆర్డినేషన్‌ కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ధర్మజన్‌, ఆంధ్రప్రదేశ్‌ నుండి అధ్యక్ష, కార్యదర్శులు శాస్త్రి, సుధాకర్‌ తదితరులు మాట్లాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)