హెడ్ మాస్టర్ మీ చితక బాదిన విద్యార్థినులు

Telugu Lo Computer
0


కర్ణాటకలోని మండ్యా జిల్లాలోని పాండవపుర తాలుకాలోని కట్టేరి ప్రాంతంలో ఆర్ వీఎంఎస్ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇదే స్కూల్ లో చిన్మయానంద మూర్తి హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.ఐదు సంవత్సరాల నుంచి చిన్మయానంద మూర్తి అదే స్కూల్ లో హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేశాడు. ప్రభుత్వ స్కూల్ లో మహిళలు. పురుషులు టీచర్లుగా పని చేస్తున్నారు. స్కూల్ లో వందలాదిమంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. స్కూలో చదువుతున్న అమ్మాయిలకు హాస్టల్ ఉంది. హైస్కూల్ హెడ్ మాస్టర్ చిన్మయానంద మూర్తి అదే లేడీస్ హాస్టల్ వార్డెన్ గా పని చేస్తూ హాస్టలో ఉన్న అమ్మాయిలకు టార్చర్ పెట్టాడు. రాత్రి హాస్టల్ లో అమ్మాయి మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసిన హెడ్ మాస్టర్ చిన్మయానంద ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మాయి కేకలు వెయ్యడంతో అదే హాస్టల్ లో ఉన్నా అమ్మాయిలు అందరూ కలసి కర్రల తీసుకుని హెడ్ మాస్టర్ చిన్మాయానందను చితకబాదేశారు. ఈ విషయం కర్ణాటకలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కర్ణాటక విద్యాశాఖ అధికారులు సంఘటనా స్థలానికి  చేరుకుని అమ్మాయిల నుంచి వివరాలు సేకరించారు. తక్షణం హెడ్ మాస్టర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని విద్యాశాఖా అధికారులు తెలిపారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్ చిన్మయానందను పోలీసులు అరెస్టు చేశారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)