రాజా పటేరియా అరెస్టు

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు రాజా పటేరియాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రధాని మోదీని చంపడానికి సిద్ధంగా ఉండండి అంటూ కాంగ్రెస్ నేత రాజా పటేరియా వీడియోలో వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం అయింది. ''మోదీ మతం, కులం, భాష ఆధారంగా విభజిస్తారు.దీనివల్ల దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే మోదీని చంపడానికి సిద్ధంగా ఉండండి''అంటూ పటేరియా పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మాజీమంత్రి పటేరియాపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.పన్నాలోని పావై పోలీస్ స్టేషన్‌లోపటేరియాపై కేసు నమోదైంది. పటేరియాను దామోహ్ జిల్లాలోని హటా పట్టణంలోని అతని నివాసం నుంచి పోలీసులు అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)