ఉత్తరప్రదేశ్లో మధురకు చెందిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కొడుకుకు ఆన్ లైన్ క్లాస్ అని చెప్పి తండ్రి నుంచి ఫోన్ తీసుకున్నాడు. క్లాస్ అయిన తర్వాత అందులో గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. ఉన్నట్లుంది బాలుడు వాడుతున్న ఫోన్ పేలిపోయింది. ఆ పేలుడు శబ్దానికి వేరే గదిలో ఉన్న అతడి తల్లిదండ్రులు హుటాహుటినా వచ్చి చూడగా బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. గేమ్స్ ఆడుతుండగానే మొబైల్ పేలిందని, ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో జునైద్ తీవ్రంగా భయపడ్డాడని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, జునైద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారని తండ్రి జావేద్ పేర్కొన్నాడు.
చేతిలో పేలిన సెల్ ఫోన్
December 11, 2022
0