అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధం !

Telugu Lo Computer
0

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీ పొల్యూషన్ ప్లాన్ స్టేజ్-3ని అమల్లోకి తెచ్చింది. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధం విధించింది. ఢిల్లీలో గత 24 గంటల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శుక్రవారం 288 పాయింట్ల వద్ద నిలవడంతో ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ఎయిర్ క్వాలిటీని నాలుగు అంచెలుగా తీసుకుంటున్నారు. స్టేజ్-1 ప్రకారం గాలి నాణ్యత 201-300 పాయింట్ల వరకూ ఉంటే తక్కువ నాణ్యత ఉన్నట్టు లెక్కిస్తారు. స్టే్జ్-2లో 301 నుంచి 400 వరకూ గాలి నాణ్యత ఉంటే చాలా పేలవమైనదిగా, స్టేజ్-3లో 401 నుంచి 450 వరకూ ఉంటే ప్రమాదకర స్థాయిగా, 450 పాయింట్లు దాటితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా నిర్ధారిస్తారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత శుక్రవారంనాడు 'రియల్-టైమ్ సోర్స్ అపోర్షన్‌మెంట్ ప్రాజెక్ట్' పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్య కారకారకాలను గుర్తించే పని వేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు 2021 అక్టోబర్‌లో మంత్రి వర్గం ఆమోదం తెలపగా, 2022 నవంబర్‌లో ఈ ప్రాజెక్టును కాన్పూర్ ఐఐటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఢిల్లీ, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ చేపట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)