పీలేకు ప్రధాని మోదీ సంతాపం

Telugu Lo Computer
0


బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. అతని అత్యుత్తమ క్రీడా ప్రదర్శనలు, విజయం రాబోయే తరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. పీలే మరణం క్రీడా ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు మోదీ. అతని అత్యుత్తమ క్రీడా ప్రదర్శనలు, విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో రాశారు. గత కొన్నేళ్లుగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడతున్న ఆయన గురువారం అర్ధరాత్రి మరణించారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సందర్భంగా ఫుట్‎బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతోపాటు క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళలర్పిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)