బైక్‌పై నారా బ్రాహ్మణి రైడింగ్ !

Telugu Lo Computer
0


నందమూరి బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా రాణించిన ఆమె, ఇప్పుడు ఓ బైక్ రైడర్‌గా మారారు. కొండల్లో బైక్ పై  దూసుకుపోయారు. లేహ్ నుంచి లడక్ వరకూ బైక్ రైడింగ్ చేసి నారా బ్రాహ్మణి అందరినీ ఆకట్టుకున్నారు. తాను లడఖ్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లినట్లుగా చెప్పారు. ఉదయం పూట ఇక్కడ నుంచి బైక్ రైడింగ్ చేస్తూ బయల్దేరామన్నారు. థిక్సే మాంటెన్సరికీ చేరిన తర్వాత అక్కడే టిఫిన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. బ్రాహ్మణి స్పిరిట్యువల్ ఎక్స్ పీరియెన్స్ జర్నీ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్-లడక్ లాంటి హిల్ స్టేషన్ ప్రాంతంలో బ్రాహ్మణి ట్రావెల్ చేశారు. ఎంతో బరువున్న బైక్‌ను అంతదూరం ఆమె సునాయాసంగా నడుపుకుంటూ వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నారా బ్రాహ్మణి ఒక మంచి బైక్ రైడర్ అంటూ ఆమెలో మంచి టాలెంట్ ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ఆ బైక్ చాలా బరువుగా ఉన్నా సరే.. అంత దూరం ఆమె రైడ్ చేయడం గ్రేట్ అంటున్నారు. ఆమె నడిపిన బైక్ రంగు కూడా పసుపు కావడం విశేషం. వీడియో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)