మహిళపై సామూహిక అత్యాచారం

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో షేర్ టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్‌ ఏరియాలో వదిలి పారిపోయారు. బాధితురాలు ఎలాగోలా కోలుకుని ఎత్మాద్‌పూర్‌ పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసింది. తాను షేర్డ్‌ టాక్సీ బుక్‌ చేసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గురు యువకులు ఎక్కారని పోలీసులకు తెలిపింది. కొంత దూరం వెళ్లాక, ఆ ముగ్గురూ కలిసి తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను కనిపెట్టేందుకు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు. మహిళలపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)