ఆస్తి కోసం తల్లిని చంపిన తనయుడు !

Telugu Lo Computer
0


ముంబైలో వీణ కపూర్ అను మహిళను ఆమె కుమారుడు, మరొక వ్యక్తితో కలిసి హత్య చేశాడు. మృతదేహాన్ని రాయగఢ్ జిల్లాలో నదిలో పడవేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీణ కపూర్ అనే మహిళ కనిపించకుండా పోయిందని జుహు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మొబైల్ ఉన్న ప్రదేశం ఆమె భవనం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మరుసటి రోజు ఆమె కొడుకు, అతని సహాయకుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేశారు. విచారణ సమయంలో అతను తన తల్లి తలపై బేస్ బాల్ బ్యాట్‌తో చాలాసార్లు కొట్టినట్లు ఒప్పుకున్నాడు. వారి మధ్య ఆస్తి వివాదం ఉందని, దాని కారణంగానే తాను ఈ నేరానికి పాల్పడ్డానని నిందితుడు ఒప్పుకున్నాడు. ఆమె మృతదేహాన్ని రాయ్‌గఢ్‌ జిల్లాలోని మాథెరన్‌ సమీపంలోని నదిలో పడేశానని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నిందుతులని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)