భార్యను కరెంట్ షాక్ తో చంపి భర్త !

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ పరిధిలోని గోలాగోకరన్ ప్రాంతంలో అహ్మద్ వాషి, అర్ఫా ఫాతిమా (ఉమా) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే గతంలో వీరిద్దకి పరిచయం ఉండడంతో అహ్మద్ ఉమాను నమ్మించి మతం మార్చుకోమన్నాడు. దీంతో ఆమె మతం మార్చుకున్న తర్వాత అహ్మద్ ఉమా పేరును అర్ఫా ఫాతిమాగా మార్చి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇటీవల ఓ రోజు రాత్రి ఏదో విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కొంత సేపటి తర్వాత భార్య నిద్రపోయింది. ఇదే మంచి సమయం అనుకున్న భర్త కోపంతో భార్య కాళ్లు, చేతులు తాళ్లతో కదలకుండా కట్టాడు. అనంతరం భర్త అతి దారుణంగా భార్యను కరెంట్ షాక్ పెట్టి చంపాడు. భార్య చనిపోయిందని నిర్దారించుకున్న భర్త, భార్య శవాన్ని ఇంట్లో బెడ్ రూంలోనే పాతిపెట్టాడు. కోడలు ఇంట్లో కనిపించకపోవడంతో అనుమానం వచ్చి తల్లి కొడుకుని ప్రశ్నించింది. దీంతో ఆమె కుమారుడు అహ్మద్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన అతని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా భర్తను విచారించారు. భర్త అహ్మద్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అతనిపైనే అనుమానం వచ్చింది. దీంతో పోలీసుల స్టైల్ లో విచారించే సరికి భర్త అహ్మద్ అసలు నిజాన్ని బయటపెట్టి.. నా భార్యను కరెంట్ షాక్ తో చంపి ఇంట్లోనే పాతిపెట్టానని తెలిపాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇంట్లో తవ్వి చూడగా భార్య శవం బయటపడింది. అనంతరం అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)