పొగమంచుతో విమాన సర్వీసులకు అంతరాయం

Telugu Lo Computer
0


ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు ప్రజలకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. చల్లటి గాలుల వల్ల పబ్లిక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పొగమంచు వల్ల విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలుగుతోంది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలిగాలుల వల్ల దాదాపు 100 విమానాల రాకపోకల్లో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. మరికొన్ని విమానాలను దారి మళ్లించినట్టు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీని నియంత్రిస్తున్న అధికారులకు.. తాజాగా ఈ పొగమంచు వల్ల కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. గత కొన్ని రోజులుగా దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. పొగమంచు కారణంగా వెలుతురు తగ్గడంతో ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయంలో దాదాపు ఆరు గంటల పాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా వందలాది మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే విస్తారా, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థల విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)