కల్తీ మద్యానికి ముగ్గురు బలి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 14 December 2022

కల్తీ మద్యానికి ముగ్గురు బలి


బీహార్ లోని సరాన్‌ జిల్లా ఛాప్రా ఏరియాలో కల్తీ మద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతుంది. దీంతో అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన..తనిఖీలు చేసిన గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారు చేస్తూ, సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అలాగే మరికొంత మంది అస్వస్థతకు గురైతే హాస్పటల్ లో జాయిన్ చేసారు.

No comments:

Post a Comment