ఫిరోజాబాద్ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగర సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు సైఫాయి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. లూథియానా నుంచి రాయ్‌బరేలీకి 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం సంభవించింది. బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో డీఎంసీ వాహనం బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి బస్సును తొలగించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)