ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగర సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు సైఫాయి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. లూథియానా నుంచి రాయ్బరేలీకి 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం సంభవించింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో డీఎంసీ వాహనం బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి బస్సును తొలగించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిరోజాబాద్ ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
December 14, 2022
0
Tags