కూతుళ్లపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన తల్లి !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కోలార్‌ జిల్లా ముల్బాగల్‌లో  ఇద్దరు కుమార్తెలపై తల్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్తతో గొడవలు కారణంగా తన ఇద్దరు పిల్లలకు తల్లి నిప్పంటించింది. తన ఇద్దరు పిల్లలకు ముందుగా నిప్పంటించి, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఘటన స్థలం నుంచి మండుతున్న వాసనను గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)