'మాండౌస్' తుఫాన్ ముప్పు !

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు 'మాండౌస్'అని పేరు పెట్టారు. ఈ మాండౌస్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫాను రానున్న 24గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మాండౌస్ అంటే అరబిక్ భాషలో “నిధి పెట్టె” అని అర్థం. బుధవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్యదిశగా పయనించి బుధవారం సాయంత్రానికి తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఈ తుఫాను ఫలితంగా ఏపీ, తమిళనాడు సముద్ర తీరాల వెంబడి తీవ్రమైన ఉరుములతో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాను డిసెంబర్ 7 బుధవారం సాయంత్రం ఉత్తర తమిళనాడు తీరం నుండి నైరుతి బంగాళాఖాతం, డిసెంబర్ 8 గురువారం ఉదయం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ ప్రభావంతో డిసెంబర్ 8 నుంచి 10  తేదీల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందన్నారు. డిసెంబర్ 7, బుధవారం సాయంత్రం నుండి డిసెంబర్ 11 ఆదివారం వరకు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)