అన్ని వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాడుతుంది !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాలు  ఢిల్లీ లోని ఏఐసీసీ ఆఫీస్ లో జరిగాయి. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే పార్టీ జెండా ఎగరేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్ జోడో యాత్రకు ప్రజల మద్దతు లభించిందన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో జనం అల్లాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతం కోసం కాంగ్రెస్ పని చేస్తుందని ఖర్గే తెలిపారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన క్యాబినెట్ లో ఐదుగురు కాంగ్రెసేతర నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తమ పోరాటం ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకమని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్నాయన్నారు. తమ పార్టీకి 50 ఏళ్ల తర్వాత దళిత సామాజిక వర్గం నేత అధ్యక్షుడయ్యారని చెప్పారు. రాహుల్ గాంధీ రాముడు కాదని, అయితే రాముడు చూపిన బాటలో వెళ్తున్నాడని అన్నారు. అయితే రాముడి బాటలో వెళ్లేందుకు హక్కు లేదని బీజేపీ నేతలు అంటున్నారన్నారు. బీజేపీ మాత్రం రాముడు కాకుండా రావణుడి బాటలో వెళ్తోందని కౌంటర్ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)