ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్-5లో ఉన్న భారత్, మొదట బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించగానే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. భారత్ విజయం సాధించిన 2 గంటల్లోపే ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకగా సౌతాఫ్రికా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 76.92 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి ఫైనల్ బెర్త్ ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత జట్టు 55.77 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 54.55 పాయింట్లతో మూడు, 53.33 పాయింట్లతో శ్రీలంక నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ 44.44 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. పాక్ 42.42 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్కు ముందు టీమిండియా మరో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్తో మరో టెస్టుతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే టీమిండియా నేరుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఓడిపోతే మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి వస్తుంది. సఫారీలను ఆసీస్ క్లీన్స్వీప్ చేయగలిగితే, భారత్ ఫైనల్ చేరడం మరింత సులువవుతుంది. దక్షిణాఫ్రికా ఒకటి లేదా రెండు టెస్టుల్లో గెలిచినా టీమిండియాకు ఇబ్బందికరమే.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానం !
December 19, 2022
0
Tags