ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోని సుమెర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్గావ్లో నివసిస్తున్న రిటైర్డ్ జవాన్ పరశురామ్ ప్రజాపతి తన కుమార్తె నేహాకు నౌకాదళంలో పనిచేస్తున్న సౌఖర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగి ప్రజాపతితో వివాహం నిశ్చయించారు. పట్టణంలోని శివ మ్యారేజ్ గార్డెన్లో ఈ నెల 15 న వివాహ వేడుక జరిపారు. వివాహంలో తన కుమార్తె నేహాకు కట్నంగా బుల్డోజర్ను పరశురామ్ అందించాడు. బుల్డోజర్ను కానుకగా ఇవ్వడం వెనుక తండ్రి పరశురామ్ వాదన మరోలా ఉన్నది. తన అల్లుడికి కారు కట్నంగా ఇస్తే ఇంటి ముందు నిలబడి ఉంటుందని, అదే బుల్డోజర్ అయితే ఆదాయం తెచ్చిపెడుతుంది అని చెప్తున్నారు. తాను సివిల్ సర్వీస్కు సిద్ధమవుతున్నందున ఖర్చుల కోసం భర్తను డబ్బు అడగాల్సిన అవసరం లేద చెప్తున్నది వధువు నేహా. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ ట్రెండ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. హమీర్పూర్ జిల్లాలోని ఈ అపూర్వ వివాహ కానుక ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పెండ్లి వేడుక వేదిక వద్ద అమ్మాయి తండ్రి తన కాబోయే అల్లుడికి బెలూన్లతో అలంకరించిన కొత్త బుల్డోజర్ను అందజేశాడు. పెండ్లిలో కట్నంగా బుల్డోజర్ పెట్టారనే వార్త గుప్పుమనగానే.. ఈ పెండ్లిని చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. బుల్డోజర్ను చూసి చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
కూతురికి కట్నంగా బుల్డోజర్ !
December 17, 2022
0
Tags