సినీ నటి శారద, విజయ రాఘవన్ నంబియార్ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటస్ చాక్లెట్ కంపెనీని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్ కంపెనీ ప్రస్తుతం సింగపూర్ సంస్థ సన్షైన్ అలైడ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుబంధంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దౌలతాబాద్లో యూనిట్ కలిగిన ఈ కంపెనీలో మెజారిటీ వాటాను అంటే 51 శాతం షేరును రిలయెన్స్ సొంతం చేసుకుంది. ఒక్కో షేరుకు 113 రూపాయల చొప్పున మొత్తం 74 కోట్ల రూపాయలు చెల్లించనుంది.