ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా ఫరీద్పూర్ ప్రాంతానికి చెందిన ముఖేష్ వాల్మీకి మరో వ్యక్తితో కలిసి మద్యం సేవిస్తూ రెండు కుక్క పిల్లల తోక, చెవులు కోసి వాటికి ఉప్పు పూసుకుని తినేశాడు. తోక, చెవులు కత్తిరించడంతో కుక్క పిల్లలకు తీవ్ర రక్తస్రావం జరిగింది. కుక్క పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వాటికి చికిత్స అందించేందుకు పశు వైద్యశాలకు తరలించారు. ఈ దారుణ ఘటనపై పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యుడు ధీరజ్ పాఠక్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై జంతువులపై క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అఖిలేష్ చౌరాసియా దర్యాప్తు ప్రారంభించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.