జల ప్రవేశం చేసిన యుద్ధనౌక 'మర్ముగోవా'

Telugu Lo Computer
0


ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐఎన్‌ఎస్‌ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌, గోవా గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిల్లయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 'ఈరోజు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాం. ఏడాది క్రితమే మనం సిస్టర్‌ షిప్‌ విశాకపట్నంను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాం. గత దశాబ్దకాలంలో యుద్ధనౌకల డిజైన్‌, నిర్మాణంలో ఈ విజయం గొప్ప పురోగతిని సూచిస్తుంది. ఈ నౌకలకు నగరాల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాం.' అని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)