కేంద్రం ప్రభుత్వ ప్రచారం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా ఏకంగా రూ. 6,509.56 కోట్లు వినియోగించింది. గత ఎనిమిదేళ్లలో ఈ సొమ్మును ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచారం కోసం వాడింది. ప్రింట్ మీడియాకు రూ.3,248.77 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.3,260.79 కోట్ల ప్రకటనలు ఇచ్చినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఈ ప్రకటనలు ఇచ్చామన్నారు. సీపీఎం ఎంపీ ఎం.సెల్వరసు అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 7 నాటికే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కు ప్రకటనల కోసం రూ.168.8 కోట్లు ఖర్చు చేసింది.
ప్రచారం కోసం రూ. 6,509.56 కోట్లు ఖర్చు !
December 14, 2022
0
Tags