కాంగ్రెస్ పార్టీని మళ్లీ పట్టాలెక్కించడమే లక్ష్యంగా రాహుల్ 'భారత్ జోడో' కొనసాగుతోంది. ఈ యాత్రకు ఆయా రాష్ట్రాల్లో విశేష స్పందన లభిస్తోంది. రాహుల్ బాటలో నడిచేందుకు సోదరి ప్రియాంక గాంధీ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది రెండు నెలలపాటు ప్రియాంక 'మహిళా మార్చ్'ను నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ఇది జరుగుతుందని ఆయన వివరించారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక మహిళా మార్చ్ ప్రారంభం కానుండడం గమనార్హం.
జనవరి 26 నుంచి మార్చి 26 వరకు మహిళా మార్చ్ !
December 04, 2022
0
Tags