తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే !

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా తెలంగాణ రాజకీయంపై స్పందించారు. ''తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు వెళ్తానని అన్నారు. అక్కడ ప్రజల నాడీ తనకు తెలుసన్న షా.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తప్పనిసరిగా మార్పు వస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అధికార కైవసం కోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)