మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం !

Telugu Lo Computer
0


గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  రాజ్‌కోట్ జిల్లా ధోరాజీలో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, గుజరాత్ ప్రజలు తన గురువులని, వారి ఆశీర్వాదాలు తనకు కావాలన్నారు. గుజరాత్ ప్రజలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారు తనకు శిక్షణనిచ్చి, తనను అభివృద్ధి చేశారని చెప్పారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ''అందుకే మీ ఆశీర్వాదాలు నాకు ముఖ్యం'' అని చెప్పారు. రెండు దశాబ్దాలపాటు సమైక్యంగా కృషి చేసినందుకే బీజేపీ ప్రజల ఆశీర్వాదాలను పుష్కలంగా పొందుతోందని చెప్పారు. కచ్ ఎడారి పెద్ద సమస్యగా ఉండేదని, దానిని గుజరాత్ కమానుద్వారంగా అభివృద్ధి చేశామని చెప్పారు. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడతారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)