ఉత్తర కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన భారత్

Telugu Lo Computer
0


యునైటెడ్ నేషన్స్​లో  జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఇండియా శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్​కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ లాంటివి,  ప్రపంచ దేశాల శాంతిభద్రతలకే ప్రమాదమని అన్నారు. కొరియా దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు, డీన్యూక్లియరైజేషన్​కు ఇండియా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు, భద్రతా మండలి కలసికట్టుగా ఉండాలని ఆమె కోరారు. ఇటీవల ఉత్తర కొరియా మిసైల్ టెస్ట్ చేయగా ఆ దేశ ప్రెసిడెంట్ కిమ్‌ భార్య, కూతురుతో కలిసి శక్తిమంతమైన ఇంటర్​కాంటినెంటల్ మిసైల్‌ టెస్ట్‌ను పరిశీలించారు. శత్రువుల బెదిరింపులు కొనసాగితే న్యూక్లియర్ వెపన్స్ తో సమాధానం ఇస్తామని కిమ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే యూఎన్​లో భద్రతా మండలి రెండోసారి సమావేశమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)