ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 November 2022

ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి


మహారాష్ట్రలోని ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖపోలీ ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సంఘటన స్థలంలో నలుగురు అక్కడికి అక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రులను నవీ ముంబయి సమీపంలోని కామోథీలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.అతి వేగం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై అతివేగం వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదానికి గురైన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.

No comments:

Post a Comment