పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని బద్మేర్ లో ఓ వ్యక్తి పేపర్ చదువుతూనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మృతి చెందిన వ్యక్తిని గుజరాత్ కి చెందిన దిలీప్ కుమార్ మిదానిగా గుర్తించారు. వస్త్ర వ్యాపారం చేసే దిలీప్, పంటి నొప్పి నేపథ్యంలో డాక్టర్ ను కలిసేందుకు ఆస్పత్రికి వచ్చాడు. వైద్యుడిని కలిసేందుకు  వెయిట్ చేస్తూ బెంచ్ పై కూర్చొని పేపర్ చదువుతుండగా అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో అక్కడున్న క్లినిక్ సిబ్బంది చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)