ఢిల్లీకి చెందిన ప్రవీణ్కు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్య, పిల్లలతో ప్రవీణ్ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్కు గీత అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో, వీరిద్దరూ పలుమార్లు ఢిల్లీలోని హోటల్స్లో కలుసుకునేవారు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా వీరు ఓయో హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. అనంతరం, రూమ్లో వారిద్దరూ వాదనలకు దిగారు. వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో నిందితుడు ప్రవీణ్.. గీత చాతిపై గన్తో కాల్చాడు. దీంతో, ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత ప్రవీణ్ తనను తాను గన్తో కాల్చుకున్నాడు. గన్ పేలిన శబ్ధం వినిపించడంతో హోటల్ సిబ్బంది వెంటనే రూమ్కు వెళ్లి చూడగా వారిద్దరూ కిందపడిపోయి ఉన్నారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వగా, అక్కడకు చేరుకున్న పోలీసులువారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గీత మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్ గాయాలతో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు.
వివాహేతర సంబంధం ప్రాణం తీసింది !
November 23, 2022
0
Tags