ఎన్డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో మెజార్టీ షేర్లు, యాజమాన్యపు హక్కులను సొంతం చేసుకుంది. ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్ 55.18 శాతం వాటా దక్కించుకుంది. సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్లను కొత్త డైరెక్టర్లుగా నియమించింది. బోర్డు డైరెక్టర్లుగా ప్రణయ్ రాయ్, ఆయన భార్య తప్పుకోగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్డీటీవీని ట్విట్టర్లో అన్ఫాలో చేశారు. ఇప్పటివరకూ ఎన్డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి అదానీ బినామీ అని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా అదానీ విషయంలో ఇదే వైఖరితో ఉంది. దీంతో.. ఇకపై బీజేపీ ప్రో ఛానల్గా ఎన్డీటీవీ మారిందన్న సంకేతానిచ్చేలా కేటీఆర్ ఆ ఛానల్ను అన్ఫాలో చేయడం గమనార్హం.
ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ దంపతుల రాజీనామా
November 30, 2022
0
Tags