చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి !

Telugu Lo Computer
0


తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బాదుడే బాదుడు నిరసన రోడ్‌షో నిర్వహిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకి గాయాలయ్యాయి. మధుబాబు గడ్డం కింద గాయం కావడంతో వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తన పర్యటనలో పోలీసుల భద్రత సరిగా లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా గూండాలు ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. వైకాపా రౌడీలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)