శ్రీవారి దర్శనం అయిన తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు భారీ క్యూలైన్లలో నిలబడి తీసుకుంటారు. భక్తుల బలహీనతను టీటీడీ సిబ్బందిలో కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ టోకెన్ల విక్రయంలో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూ కౌంటర్లో పనిచేస్తున్న మస్తానయ్య అనే వ్యక్తి భక్తులకు టోకెన్లు ఇచ్చే సమయంలో పరిమితికి మించి టోకెన్లు జనరేట్ చేస్తూ పట్టుబడ్డాడు. మస్తానయ్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి టోకెన్లు పంచుకుంటుండగా గుర్తించి టీటీడీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో మస్తానయ్య, రాజేష్, హర్షవర్ధన్, శివ అనే నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మస్తానయ్య వద్ద నుంచి అక్రమంగా విక్రయిస్తున్న 76 టోకెన్లు స్వాధీనం చేసుకున్నారు.
శ్రీవారి లడ్డూలు టోకెన్ల విక్రయంలో సిబ్బంది గోల్ మాల్ !
November 04, 2022
0
Tags