పలమనేరులో స్వల్ప భూకంపం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించింది. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం బిక్కుబిక్కుమంటూ రోడ్లపై గడిపారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని కారణాలను అన్వేషిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)