ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు !

Telugu Lo Computer
0


టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది హైకోర్టు. ప్రతీ సోమవారం సిట్  ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు లో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసుకు సంబంధించి పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. అలాగే నిందితుల బెయిల్ పై కూడా విచారణ జరిగింది. కానీ నిన్న బీజేపీ లాయర్, ప్రభుత్వం తరపు లాయర్ వాదనలతోనే కోర్టు సమయం అయిపోయింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)