టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది హైకోర్టు. ప్రతీ సోమవారం సిట్ ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు లో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసుకు సంబంధించి పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. అలాగే నిందితుల బెయిల్ పై కూడా విచారణ జరిగింది. కానీ నిన్న బీజేపీ లాయర్, ప్రభుత్వం తరపు లాయర్ వాదనలతోనే కోర్టు సమయం అయిపోయింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
Post Top Ad
adg
Wednesday, 30 November 2022
Home
telangana
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు !
నందకుమార్
ప్రతీ సోమవారం సిట్ ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం
రామచంద్రభారతీ
సింహయాజి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు !
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు !
Tags
# telangana
# ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు !
# నందకుమార్
# ప్రతీ సోమవారం సిట్ ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం
# రామచంద్రభారతీ
# సింహయాజి
About Telugu Lo Computer
సింహయాజి
Tags
telangana,
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు !,
నందకుమార్,
ప్రతీ సోమవారం సిట్ ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం,
రామచంద్రభారతీ,
సింహయాజి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment