అతడు థెరపిస్టు కాదు రేపిస్టు !

Telugu Lo Computer
0


ఆప్‌ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిలో ఒక ట్విస్ట్‌ బయటకు వచ్చింది. తిహార్ జైలు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వీడియోలో జైన్‌కు మసాజ్‌ చేస్తోన్న వ్యక్తి పేరు రింకూ. అతడొక ఖైదీ. అత్యాచార కేసులో జైల్లో ఉన్నాడని ఆ వర్గాలు తెలిపాయి. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతడి కన్న కూతురే ఆరోపణలు చేసింది. దానికింద గత ఏడాది అతడు అరెస్టయ్యాడు. 'జైన్‌కు మర్దన చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదు. ఒక రేపిస్టు. దీనిని కూడా ఆప్ సమర్థించుకుంటుందా..? వారు తిహార్ ను థాయ్‌లాండ్‌గా మార్చుకున్నారు' అంటూ భాజపా తీవ్రంగా విమర్శలు చేసింది. ఆప్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తోంది. అది మసాజ్‌ కాదు..ఫిజియోథెరపీ అంటూ తన వాదనను వినిపిస్తోంది. మనీలాండరింగ్ కేసులో జైన్ జైల్లోనే ఉంటున్నారు. ఇక వచ్చే నెలలో దిల్లీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఈ వీడియో ఆప్‌, భాజపా మధ్య తీవ్ర ఘర్షణకు దారితీస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)