ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా హిజ్రా !

Telugu Lo Computer
0


కర్ణాటక లోని రాయచూరు రూరల్‌, మాన్వి తాలూకా నీరమాన్విలో ప్రభుత్వ పాఠశాలలో  అశ్వత్థామ అలియాస్‌ పూజా (26) సోషల్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. హిజ్రా కోటాలో ఉద్యోగం లభించినట్లు పూజా తెలిపారు. ఆమె నీరమాన్విలోనే టెన్త్‌ వరకూ కన్నడలో విద్యనభ్యసించింది. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. పూజా మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులో ఉండగా హిజ్రాగా మారినట్లు తెలిపారు. చదువుపై ఇష్టంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని బీఏ, బీఈడీ పూర్తి చేసినట్లు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)