జంట దారుణ హత్య !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని ఉబేశ్వర్‌జీ అడవుల్లో ఒక ఆడ, మగ వ్యక్తుల మృతదేహాలు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. దారుణ హత్యకు గురైన ఆ జంట మృతదేహాలు నగ్నంగా పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. మహిళపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాల పక్కనే పడి ఉన్న మొబైల్‌ ఫోన్లు, దుస్తులు, లోదుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం, డాగ్ స్క్వాడ్‌ను కూడా సంఘటనా స్థలానికి రప్పించినట్లు ఎస్పీ వికాస్‌ శర్మ తెలిపారు. ప్రేమ వ్యవహారం లేదా శత్రుత్వం ఈ జంట హత్యలకు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యలు రెండు రోజుల కిందట జరిగినట్లుగా కనిపిస్తున్నదని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)