డిసెంబర్ 5న ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకోనున్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో ప్రధానితో ఇటీవల చంద్రబాబు భేటీ కాగా.. ఈనెల 12న విశాఖ పర్యటనలో ప్రధానితో కలిసి ఒకే వేదికపై కనిపించారు సీఎం జగన్. ఇక ఢిల్లీలో జరిగే సమావేశంలో ప్రధానితో వేదికను జగన్, చంద్రబాబు పంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఒకే వేదికను పంచుకోనున్న చంద్రబాబు, జగన్ !
November 24, 2022
0
Tags