దేశంలో 937 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 937 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 9 మంది మృతి చెందినట్లు తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.46కోట్లు దాటింది. ఇందులో 4.41 కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకోగా..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,30,509 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 14,515 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.03శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.73 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)