క్వారీ కూలి 8 మంది దుర్మరణం !

Telugu Lo Computer
0


మిజోరాంలోని హ్నాథియాల్ జిల్లా మౌదర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రాతి క్వారీ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో క్వారీ కింద పడి పలువురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో 12 మంది కార్మికులు ఇంకా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 12 మంది కార్మికులలో నలుగురు ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు, ఎనిమిది మంది కాంట్రాక్టర్ ఉద్యోగులు ఉన్నారు. ఇద్దరు అధికారులు, 13 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అస్సాం రైఫిల్స్,బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన సైనికులు స్థానిక పోలీసులతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్ట్‌మార్టం పరీక్ష కోసం తీసుకువెళతామని హ్నాథియల్ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ సైజిక్‌పుయి తెలిపారు. తప్పిపోయిన వారందరినీ కనుగొనే వరకు రెస్క్యూ కొనసాగుతుందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తెలిపింది. ఐదు ఎర్త్ ఎక్స్‌కవేటర్లు, స్టోన్ క్రషర్, డ్రిల్లింగ్ మెషిన్ కూడా పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయినట్లు ఓ అధికారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)