8న శ్రీవారి ఆలయం మూసివేత

Telugu Lo Computer
0


ఈనెల 8వ తేదీన చంద్రగ్రహణం కారణంగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కూడా రద్దు చేశారు.. గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ కూడా ఉండదని అధికారులు ప్రకటించారు. బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను అన్నీ  టీటీడీ రద్దుచేసింది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం 2 నుండి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. 8వ తేదీన మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని, ఈ కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్టు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)