ఎస్బీఐ ఛైర్మన్‌కు బెదిరింపు కాల్

Telugu Lo Computer
0


ముంబై లోని మహారాష్ట్ర అసెంబ్లీ భవనం పక్కన వున్న ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్‌లోని ఎస్బీఐ ఛైర్మన్ డి.కె.ఖారా కు  మొహమ్మద్ జియాల్ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తను పాకిస్తాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు. తను కోరుకున్నట్లుగా, కావాల్సిన వారికి వారం రోజుల్లోగా పది లక్షల రూపాయల లోన్ మంజూరు చేయాలని, లేకుంటే కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించాడు. అలాగే ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ బిల్డింగును పేల్చివేస్తామని కూడా బెదిరించాడు.  దీనిపై ఖారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. అయితే, నిందితుడు చెప్పినట్లుగా ఈ కాల్ పాకిస్తాన్ నుంచి రాలేదని, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు  ప్రయత్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)